byసూర్య | Sat, Jan 16, 2021, 12:02 PM
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. హైదరాబాద్ లోని నిమ్స్ లో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్, గాంధీ ఆస్పత్రిలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్, తిలక్ నగర్ లోని యూపీహెచ్సీలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మిగిలిన జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు టీకాల ప్రక్రియను ప్రారంభించారు.
గాంధీ ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికురాలు ఎస్.కృష్ణమ్మ కరోనా టీకా తీసుకున్న తొలి వ్యక్తిగా రికార్డులోకి ఎక్కింది. టీకా ఇచ్చిన అనంతరం ఆమెతో మంత్రి ఈటల రాజేందర్ మాట్లాడారు. ఆరోగ్యం ఎలా ఉందంటూ అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమెను అబ్జర్వేషన్ గదికి తరలించారు.