byసూర్య | Thu, Oct 08, 2020, 12:36 PM
రాష్ట్రంలో అత్యాచారాలు, హత్యలపై కాంగ్రెస్ నిరసనకు దిగింది. గురువారం నాడు హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ ముట్టడికి కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. గేట్లను ఎక్కి కాంగ్రెస్ కార్యకర్తలు లోపలికి చొరబడ్డారు. హోంమంత్రి నివాసంలోకి చొరబడేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. హోంమంత్రి నివాసం ఎదుట సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ ధర్నాకు దిగారు. రంగంలోకి దిగిన పోలీసులు.. కార్యకర్తలను, నేతలను అడ్డుకున్నారు. అయితే కొందరు మాత్రం లోపలికి ప్రవేశించారు. బయటే ఉన్న కార్యకర్తలంతా హోం మంత్రికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. ఈ క్రమంలో హోం మంత్రి ఇంటి వద్ద సెక్యూరిటీని పెంచారు. పెద్దఎత్తున పోలీసు బలగాలు క్వార్టర్స్ దగ్గరికి చేరుకుంటున్నాయి.