గచ్చిబౌలిలో విషాదం

byసూర్య | Tue, Oct 15, 2019, 09:48 AM

హైదరాబాద్ గచ్చిబౌలిలో విషాదం నెలకొంది. సాఫ్ట్ వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. అపార్ట్ మెంట్ పైనుంచి దూకి చనిపోయాడు. తీవ్రగాయాలతో స్పాట్ లోనే ప్రాణాలు వదిలాడు. మృతుడి పేరు రఘురాం. వయసు 35ఏళ్లు. గచ్చిబౌలిలోని ఇన్ఫోసిస్ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా పని చేస్తున్నాడు. రఘురాం మానసిక పరిస్థితి బాగోలేదని కుటుంబసభ్యులు తెలిపారు. బైపోలార్ డిజార్డర్ తో బాధపడుతున్నాడని చెప్పారు.


సోమవారం(అక్టోబర్ 14,2019) సాయంత్రం డ్యూటీ ముగిశాక రఘురాం తన భార్య శ్రీదేవితో ఆఫీస్ నుంచి బయటకు వచ్చాడు. శ్రీదేవి కూడా అదే ఆఫీస్ లో జాబ్ చేస్తుంది. ఆ తర్వాత ఉన్నట్టుండి.. రఘురాం మంత్రి(mantri) అపార్ట్ మెంట్ పైకి వెళ్లాడు. అక్కడి నుంచి దూకేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేపట్టారు. రఘురాం మృతికి కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. కుటుంబసభ్యులు, ఆఫీస్ లో సహచరులను విచారిస్తున్నారు. రఘురాం స్వస్థలం ఏపీలోని విజయవాడ. 8ఏళ్ల క్రితం శ్రీదేవిని పెళ్లి చేసుకున్నాడు. రఘురాం శ్రీదేవి దంపతులకు ఆరేళ్ల పాప ఉంది. రఘురాం కుటుంబం చందానగర్ లో నివాసం ఉంటోంది. ఈ ఘటనతో రఘురాం కుటుంబసభ్యులు షాక్ కు గురయ్యారు. భార్య, తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


 


 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM