byసూర్య | Sun, Oct 13, 2019, 07:21 PM
తెలంగాణ చౌక్ నుండి ఆర్ టి సి బస్ స్టాండ్ వరకు భిక్షాటన కార్యక్రమం చేపట్టి కరీంనగర్ లో ఆర్టీసీ కార్మికులు చేస్తున్న సమ్మెకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత బొడిగె శోభ సంఘీభావం తెలిపారు. అనంతరం ఆర్టీసీ వర్క్ షాప్ వద్ద ఉద్యోగులు నిర్వహించిన వంటా వార్పులో కార్యక్రమంలో శోభ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..గత వారం రోజులుగా ఆర్టీసీ కార్మికులు తమ సమస్యల గురించి సమ్మె చేస్తుంటే మంత్రులకు పట్టడం లేదన్నారు. ఎవరైనా దసరా సెలవులు 11 రోజులు ఇస్తారా అని ఆమె మండిపడ్డారు. విద్యార్ధులు ఆర్టీసీ సమ్మెకు మద్ధతు ఇస్తారనే భయంతోనే ప్రభుత్వం సెలవులు పొడిగించిందని శోభ ఎద్దేవా చేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి మహిళ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి పోతుగంటి సుజాత రెడ్డి, బిజెపి నాయకురాలు శ్రీమతి బండ అనిత లు పాల్గొన్నారు .