byసూర్య | Sun, Oct 13, 2019, 07:23 PM
ముద్ర పథకం కింద అర్హులైన చిరు వ్యాపారులు, నిరుద్యోగులకు వ్యక్తిగత రుణాలనివ్వాలని కేంద్ర ఆర్ధిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆదివారం లేఖ రాశారు. ‘ముద్ర’ పథకంలో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని వినోద్ కుమార్ ఈ సందర్భంగా అసంతృప్తి వ్యక్తం చేశారు. తెలంగాణకు విరివిగా రుణాలనివ్వాల్సిన అవసరముందని పేర్కొన్నారు. ముద్ర రుణాల విషయం లో తెలంగాణకు న్యాయం జరిగేలా చూడాలని నిర్మలా సీతారామన్కు వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు.