తెరాస ప్రభుత్వంపై సోమారపు సంచలన ఆరోపణలు

byసూర్య | Sat, Aug 24, 2019, 05:52 PM

మాజీ ఎమ్మెల్యే, మాజీ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ తెరాస ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. తెలంగాణలో జల దోపిడీ జరుగుతోందని ,గతంలో ఆంధ్రవాళ్లు జల దోపిడీ చేస్తున్నారని కేసీఆర్ అన్నారని, అయితే ఇప్పుడు కేసీఆర్‌ పాలనలోనూ అదే జరుగుతోందని వ్యాఖ్యానించారు. గోదావరి పరిసర ప్రాంతాలకు నీరు ఇవ్వకుండా ఎక్కడికో తీసుకెళ్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అనవసరమైన రిజర్వాయర్లు కట్టి నీటిని తరలిస్తున్నారని ఆరోపించారు. ఈ చర్యలను జల దోపిడీ అనకుండా మరేమంటారని సత్యనారాయణ ప్రశ్నించారు.


Latest News
 

నిజామాబాద్ జిల్లాకు కాంగ్రెస్ అగ్రనేతలు? Wed, May 01, 2024, 05:12 PM
వడదెబ్బకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలి: జిల్లా కలెక్టర్ Wed, May 01, 2024, 05:10 PM
తనిఖీల్లో చీరలు, నగదు లభ్యం Wed, May 01, 2024, 05:07 PM
ఎన్నికల ప్రచారణ నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే Wed, May 01, 2024, 05:05 PM
బీఆర్ఎస్ మండల అధ్యక్షులు కాంగ్రెస్ లో చేరిక Wed, May 01, 2024, 05:03 PM