byసూర్య | Sat, Aug 24, 2019, 02:27 PM
పెద్దపల్లి జిల్లా విద్యాశాఖలోని సర్వశిక్ష అభియాన్ విభాగంలో డివిజినల్ లెవల్ మానిటరింగ్ టీం మెంబర్ (డీఎంఎల్టీ)గా పనిచేస్తున్న ఎలగందుల రమేశ్ అదృశ్యం మిస్టరీ ఇంకా వీడలేదు. లేఖ రాసి గత శనివారం నుంచి ఆచూకీ లేకుండా పోయింది. జాడ తెలియక కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. తమకొడుకు ఆచూకీ చెప్పాలంటూ జిల్లా విద్యాశాఖ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులు రమేశ్ చిత్రపటాలతో మంగళవారం ఆందోళనకు దిగారు. తమ కుమారుడు కనిపించకుండా పోవడానికి కారణమైన జీసీడీవో పద్మను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. తమ కుమారుని ఆచూకీ దొరికే వరకు కదిలేది లేదని కార్యాలయం ఎదుట కూర్చున్నారు.