ఖరీఫ్‌కు 8.50 లక్షల టన్నుల యూరియా

byసూర్య | Fri, Aug 23, 2019, 05:19 PM

ప్రస్తుత ఖరీఫ్‌కు 8.50 లక్షల టన్నుల యూరియాను కేంద్రం కేటాయించిందని వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి వెల్లడించారు. గోదావరిపై కాళేశ్వరం ప్రాజెక్టు అందుబాటులోకి రావడం, కృష్ణా పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురిసి ప్రాజెక్టులు నిండుగా ఉండడంతో సాగు పెరిగిందని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఎరువుల వాడకం గణనీయంగా పెరిగిందన్నారు. ఈ పరిస్థతిని ముందే ఊహించినందున కేంద్ర వ్యవసాయ శాఖా మంత్రి నరేంద్రసింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం లేఖ రాసినట్లు చెప్పారు. జిల్లాలవారీగా యూరియా డిమాండ్ వివరాలను అందించామన్నారు. కృష్ణపట్నం, విశాఖపట్నం పోర్టుల్లో ఉన్న యూరియాను తెలంగాణ ర్యాక్ పాయింట్లకు తరలించాలని కోరినట్లు నిరంజన్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం వెంటనే యూరియా కోటాను పంపిస్తుందని భావిస్తున్నామని చెప్పారు.


Latest News
 

కాంగ్రెస్ గూటికి బిఆర్ఎస్ నాయకులు Fri, May 03, 2024, 03:53 PM
రిజర్వేషన్లను ముట్టుకునే ప్రసక్తే లేదు: అరవింద్ Fri, May 03, 2024, 03:26 PM
రైల్వే సమస్యలు ఎప్పుడు తీరుతాయో..? Fri, May 03, 2024, 03:23 PM
ఎంపీ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించాలి - ఎమ్మెల్యే తోట Fri, May 03, 2024, 03:19 PM
ఎమ్యెల్యే ఆధ్వర్యంలో ఎల్లారెడ్డి పట్టణంలో ఎన్నికల ప్రచారం Fri, May 03, 2024, 03:17 PM