byసూర్య | Fri, Mar 22, 2019, 10:45 PM
తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ కి మరో దెబ్బ తగిలింది. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కాంగ్రెస్ పార్టీ కి రాజీనామా చేసారు.ఈ మేరకు రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ కి పంపించారు. పార్టీకి ఎంత నిబద్దతతో పని చేసినా తన పట్ల నిర్లక్ష్య వైఖరితోనే వ్యవహరిస్తోందని,పార్టీ విధేయులను మరిచి ఏక పక్షంగా వ్యవహరిస్తోందని ఆనంద భాస్కర్ ఆరోపించారు.రాహుల్ గాంధీ నాయకత్వం లో పార్టీ ఎదిగే సూచనలు కనిపించటం లేదని , అయితే తాను ఏ పార్టీ లో చేరాలన్న విషయం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదని ఆనంద భాస్కర్ తెలిపారు.