తెలంగాణ లోక్‌సభ ఎన్నికల బరిలో జనసేన..

byసూర్య | Sat, Mar 16, 2019, 09:26 PM

తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో పోటీకి సిద్ధమయ్యింది జనసేన. ఆశావహుల నుంచి దరఖాస్తులు స్వీకరించేందుకు నేమూరి శంకర్ గౌడ్, అర్హం ఖాన్ లతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆదివారం నుంచి మూడు రోజుల పాటు మాదాపూర్ లోని జనసేన కార్యాలయంలో దరఖాస్తులు స్వీకరిస్తారు. సాధికారిత జనసేన జనరల్ బాడీ దరఖాస్తులు పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. తొలి అభ్యర్థిని ప్రకటించి.. మిగిలిన స్థానాలకు కూడా బయో డేటాలోను ఆహ్వానించింది. ప్రముఖ వ్యాపారవేత్త, జనసేన పార్టీ వ్యవస్థాపక ఉపాధ్యక్షులు శ్రీ బొంగునూరి మహేందర్ రెడ్డిని మల్కాజ్‌గిరి లోక్‌సభ స్థానం నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేస్తారని పవన్ కళ్యాణ్ ప్రకటించారు. సమాజానికి సేవ చేయాలనే తపనతో కోట్లాది రూపాయల వ్యాపారాలను వదులుకుని తనతోనే ఉన్నారని,  కామన్ మెన్ ప్రొటెక్షన్ మ‌హేందర్ రెడ్డి ప్రజారాజ్యం పార్టీ ప్రారంభించక ముందు నుంచి తనతో కలిసి పనిచేశారన్నారు పవన్. మెదక్‌ పార్లమెంట్ స్థానం నుంచి పీఆర్పీ అభ్యర్థిగా ఎంపిక చేశామని.. ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయి నామినేషన్ వేయలేకపోయారన్నారు. ఆ తప్పును సరిద్దిద్దుకుంటూ ఆయనకు మల్కాజ్ గిరి పార్లమెంటరీ స్థానానికి అభ్యర్థిగా పంపిస్తున్నామన్నారు. హైదరాబాద్, విజయవాడల్లోని పార్టీ కార్యాలయాల్లో అభ్యర్థులు దరఖాస్తుల్ని అందజేస్తున్నారని ఓ ప్రకటనలో తెలియజేశారు. 


Latest News
 

హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు తీపి కబురు Thu, Apr 25, 2024, 08:18 PM
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థుల తుది జాబితా.. ఖమ్మం నుంచి పొంగులేటి బంధువుకు ఛాన్స్ Thu, Apr 25, 2024, 08:12 PM
చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా "పొలిమేర" నటి నామినేషన్.. పవన్ కళ్యాణ్ ఫ్యాన్ Thu, Apr 25, 2024, 08:07 PM
తీన్మార్‌ మల్లన్నకు కాంగ్రెస్ బంపరాఫర్.. ఆ స్థానం నుంచి ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటన Thu, Apr 25, 2024, 08:01 PM
ఇక వర్షాలు లేనట్లే.. నేటి నుంచి పెరగనున్న ఎండల తీవ్రత Thu, Apr 25, 2024, 07:56 PM