byసూర్య | Tue, Feb 05, 2019, 03:19 PM
గయా: బీహార్లో దొంగలు ఓ ఏటీఎంను ఎత్తుకెళ్లారు. ఈ ఘటన గయాలో జరిగింది. దీనిపై ఆ జిల్లా ఎస్పీ అనిల్ కుమార్ స్పందించారు. ఏటీఎంను దొంగలు చోరీ చేశారని, కానీ దాన్ని ఆ తర్వాత కారు నుంచి స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. అయితే ఏటీఎం మెషీన్ నుంచి దొంగలు డబ్బులు చోరీ చేయలేదని తెలుస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.