byసూర్య | Wed, Jan 23, 2019, 10:38 AM
అక్రమంగా తరలిస్తున్న కలపను పోలీసులు గుర్తించి పట్టుకున్నారు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట శివారు ఊట్లపల్లి వద్ద చోటుచేసుకుంది. వ్యానులో అక్రమంగా తరలిస్తున్న రూ. 4 లక్షల విలువైన కలపను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. నిందితులు కలపను వరంగల్ జిల్లా ఏటూరునాగారం నుంచి రాజమహేంద్రవరానికి తరలిస్తున్నట్లుగా సమాచారం.