byసూర్య | Fri, Jan 18, 2019, 04:00 PM
న్యూ ఢిల్లీ : వారానికి రెండు సార్లు నడిచే ముంబై –ఢిల్లీ రాజధాని ఎక్స్ ప్రెస్ రైలు శనివారం (19 వ తేదీ ) ప్రారంభం కానుంది. ముంబై–ఢిల్లీ మధ్య ఇది మొదటి రాజధాని ఎక్స్ ప్రెస్. ఈ రైలు రెండు ప్రధాన హిందీ రాష్ట్రాలైన ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్ గుండా ప్రయాణిస్తుంది. ముంబైలోని ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్–ఢిల్లీలోని హజ్రత్ నిజాముద్దీన్ స్టేషన్ల మధ్య నడిచే ఈ రైలు కళ్యాణ్, నాసిక్ రోడ్, జల్గావ్, భోపాల్ , ఝాన్సీ, ఆగ్రా కంటోన్మెంట్ స్టేషన్లలో ఆగుతుంది.