'SDT 18' ఆన్ బోర్డులో అజనీష్ లోకనాథ్

by సూర్య | Sat, Oct 26, 2024, 05:58 PM

టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SDT18' అని పిలువబడుతుంది. తేజ్ కొత్త లుక్‌తో ఈ సినిమా కోసం పూర్తి రూపాంతరం చెందాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం హనుమాన్ విజయవంతమైన తరువాత అధిక బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మ్యూజిక్ అందించటానికి అజనీష్ లోకనాథ్ ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రంలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించనున్నారు.

Latest News
 
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM
డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'జ్విగాటో' Sat, Oct 26, 2024, 07:12 PM
'థగ్ లైఫ్' ఈ తేదీన విడుదల కానుందా? Sat, Oct 26, 2024, 07:06 PM
150M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' టీజర్ Sat, Oct 26, 2024, 07:00 PM
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Oct 26, 2024, 06:58 PM