'SDT 18' ఆన్ బోర్డులో అజనీష్ లోకనాథ్

by సూర్య | Sat, Oct 26, 2024, 05:58 PM

టాలీవుడ్ నటుడు సాయి దుర్ఘ తేజ్ తన తదుపరి చిత్రాన్ని రోహిత్ కెపి దర్శకత్వంలో చేస్తున్నట్లు ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ 'SDT18' అని పిలువబడుతుంది. తేజ్ కొత్త లుక్‌తో ఈ సినిమా కోసం పూర్తి రూపాంతరం చెందాడు. ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి మరియు చైతన్య రెడ్డి నిర్మించిన ఈ చిత్రం హనుమాన్ విజయవంతమైన తరువాత అధిక బడ్జెట్‌తో పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఈ చిత్రంలో సాయి సరసన ఐశ్వర్య లక్ష్మి జోడిగా నటిస్తుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమాలో మ్యూజిక్ అందించటానికి అజనీష్ లోకనాథ్ ఆన్ బోర్డులో ఉన్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం భాషల్లో పాన్ ఇండియా విడుదల కానున్న ఈ చిత్రంలో సాయి దుర్ఘా తేజ్ శక్తివంతమైన పాత్రను పోషించనున్నారు.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM