by సూర్య | Sat, Oct 26, 2024, 04:06 PM
తమిళ సూపర్స్టార్ అజిత్ కుమార్ బ్యాక్-టు-బ్యాక్ రిలీజ్లకు సిద్ధమవుతున్నాడు. అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదల 2025 పొంగల్ నుండి 2025 వేసవికి వాయిదా పడినట్లు సమాచారం. ఈ చిత్రం షూటింగ్ స్పెయిన్లో కొనసాగుతోంది, రాబోయే షెడ్యూల్లను బల్గేరియా మరియు చెన్నైలో ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్ 2024 నాటికి షూటింగ్ మొత్తం పూర్తవుతుందని భావిస్తున్నారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క తమిళనాడు, కేరళ, కర్ణాటక థియేట్రికల్ రైట్స్ ని రోమియో పిక్చర్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. గుడ్ బ్యాడ్ అగ్లీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ఈ చిత్రంలో అజిత్ కి జోడిగా త్రిష నటిస్తుంది. అర్జున్ దాస్, సునీల్, ప్రసన్న ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
Latest News