బిగ్ బాస్ 18లో 'సింఘమ్‌ ఎగైన్' ని ప్రమోట్ చేస్తున్న అజయ్ దేవగన్

by సూర్య | Sat, Oct 26, 2024, 06:53 PM

రోహిత్ శెట్టి దర్శకత్వంలో అజయ్ దేవగన్ ఒక చిత్రాన్ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'సింఘం ఎగైన్' అనే టైటిల్ ని లాక్ చేసారు. హిందీలో మోస్ట్ ఎవైటెడ్ ఫిల్మ్‌లలో సింగం ఎగైన్ ఒకటి. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమాల్లో ఒకటైన సింగం ఎగైన్ ట్రైలర్ ఇటీవలే విడుదల అయ్యి సెన్సేషన్ సృష్టించింది. తాజగా మూవీ మేకర్స్ ఈ కాప్ డ్రామా సింఘం ఎగైన్‌ను ప్రమోట్ చేయడానికి సల్మాన్ ఖాన్ యొక్క పాపులర్ రియాలిటీ షో బిగ్ బాస్ 18లో అజయ్ దేవగన్‌ కనిపించరు. సల్మాన్ ఖాన్ రోహిత్ శెట్టికి తన నిబద్ధతను నెరవేర్చిన సింఘమ్ ఎగైన్‌లో చుల్బుల్ పాండేగా అతిధి పాత్రలో కనిపించబోతున్నాడు. 120 మంది వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు మరియు 30 మంది పోలీసు అధికారులు హాజరయ్యే భారీ భద్రతతో షూటింగ్ జరుగుతుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ సమయంలో షూటింగ్ చేయవద్దని ముంబై పోలీసులు సలహా ఇచ్చారని అయితే సల్మాన్ తన నిబద్ధతను గౌరవించాలని నిర్ణయించుకున్నారని సమాచారం. ఈ చిత్రం నవంబర్ 1, 2024న థియేటర్లలోకి రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్ మరియు కోలీవుడ్ స్టార్ సూర్య అతిథి పాత్రలో కనిపించవచ్చని ఊహాగానాలు ఉన్నాయి. సింఘం ఎగైన్ అనేది ప్రముఖ సింఘం ఫ్రాంచైజీలో మూడవ చిత్రం మరియు అక్షయ్ కుమార్, కరీనా కపూర్ ఖాన్, రణ్‌వీర్ సింగ్, దీపికా పదుకొనే మరియు టైగర్ ష్రాఫ్‌ ఈ హై ఆక్టేన్ సినిమాలో కనిపించనున్నారు. అజయ్ దేవగన్, జ్యోతి దేశ్ పాండే, రోహిత్ శెట్టి నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతం అందించారు. 

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM