మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్

by సూర్య | Sat, Oct 26, 2024, 02:55 PM

మెగాస్టార్ చిరంజీవి సోష‌ల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్ వేదిక‌గా చేసిన ఓ ఎమోష‌న‌ల్ పోస్ట్ ప్ర‌స్తుతం బాగా వైర‌ల్ అవుతోంది. త‌న న‌ట ప్ర‌స్థానానికి యాభై ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అప్ప‌టి రోజుల‌ను గుర్తు చేసుకోవ‌డం ఈ పోస్టులో ఉంది. "డిగ్రీ చ‌దువుకునేట‌ప్పుడు న‌ర్సాపూర్‌ వైఎన్ఎం కాలేజ్ లో రంగ‌స్థ‌లం మీద రాజీనామా అనే తొలి నాట‌కం వేశాను. న‌టుడిగా తొలి గుర్తింపు వ‌చ్చింది. అది బెస్ట్ యాక్ట‌ర్‌ను చేయ‌డంతో పాటు ఎన‌లేని ప్రోత్సాహాన్ని అందించింది. 1974 -2024: 50 సంవత్సరాల నట ప్రస్థానం.. ఎనలేని ఆనందం!" అని చిరు త‌న పోస్టులో రాసుకొచ్చారు. దీనికి అప్ప‌టి త‌న పాత ఫొటోను జోడించారు. ప్ర‌స్తుతం మెగాస్టార్ షేర్ చేసిన ఈ పోస్టు సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతోంది. మెగా అభిమానులు దీన్ని తెగ షేర్ చేస్తున్నారు.

Latest News
 
150M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న 'పుష్ప 2' టీజర్ Sat, Oct 26, 2024, 07:00 PM
'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ అవుట్ Sat, Oct 26, 2024, 06:58 PM
బిగ్ బాస్ 18లో 'సింఘమ్‌ ఎగైన్' ని ప్రమోట్ చేస్తున్న అజయ్ దేవగన్ Sat, Oct 26, 2024, 06:53 PM
తన పెళ్లి ప్లాన్స్ గురించి ఓపెన్ అయ్యిన రాశి ఖన్నా Sat, Oct 26, 2024, 06:47 PM
నీక్‌లో తన పాత్ర ఎలా వచ్చిందో వెల్లడించిన ప్రియాంక మోహన్ Sat, Oct 26, 2024, 06:41 PM