పాలిటిక్స్‌లోకి రావాలంటే ఎన్నో విష‌యాల‌పై అవ‌గాహ‌న ఉండాల‌న్న సుప్రీం హీరో

by సూర్య | Fri, Oct 25, 2024, 03:25 PM

సుప్రీం హీరో, మెగా మేన‌ల్లుడు సాయిదుర్గా తేజ్ రాజ‌కీయాల్లోకి రావ‌డంపై తాజాగా ఆస‌క్త‌కిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఓ వెబ్‌సైట్ ఇంట‌ర్వ్యూలో మాట్లాడిన ఆయ‌న ప్ర‌స్తుత రోజుల్లో రాజ‌కీయాల్లోకి రావ‌డం అంత ఈజీ కాద‌న్నారు. ఎన్నో విష‌యాల‌పై అవ‌గాహ‌న క‌లిగి ఉండాల‌ని తెలిపారు. ప్ర‌స్తుతం త‌న దృష్టంతా సినిమాల‌పైనే అని స్ప‌ష్టం చేశారు. ఎన్నో విభిన్న‌మైన చిత్రాల్లో న‌టించి ప్రేక్ష‌కుల‌ను అల‌రించాల‌ని అన్నారు. పాలిటిక్స్‌లో రావాల‌నే ఆలోచ‌న ప్ర‌స్తుతం త‌న‌కు లేద‌న్నారు. రాజ‌కీయాల్లోకి రావాలంటే ముఖ్యంగా ప్ర‌జా స‌మస్య‌ల‌పై అవ‌గాహ‌న ఉండాల‌ని తెలిపారు. అలాగే ఎన్నో విష‌యాలు నేర్చుకోవాల్సి ఉంటుంద‌న్నారు. ఈ క్ర‌మంలో త‌న‌కు జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదాన్ని సాయిదుర్గా తేజ్ గుర్తు చేసుకున్నారు. ఇది త‌న‌కు పున‌ర్జ‌న్మ అని అన్నారు. ఆ ప్ర‌మాదం త‌ర్వాత దాదాపు రెండు వారాల పాటు కోమాలో ఉన్న విష‌యాన్ని తెలియ‌జేశారు. ఈ సంద‌ర్భంగా ద్విచ‌క్ర‌వాహ‌నం డ్రైవ్ చేసేవారు త‌ప్ప‌కుండా హెల్మెట్ ధ‌రించాల‌ని సూచించారు. తాను ఇవాళ ప్రాణాల‌తో ఉండ‌టానికి కార‌ణం హెల్మెటేన‌ని తెలిపారు. ఇదిలాఉంటే... ప్ర‌స్తుతం సాయిదుర్గాతేజ్ చేతిలో ఒక్క సినిమా మాత్ర‌మే ఉంది. కొత్త ద‌ర్శ‌కుడు రోహిత్ కేపీ డైరెక్ష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. స‌రికొత్త స‌బ్జెక్ట్‌తో ఈ సినిమా రూపుదిద్దుకుంటున్న‌ట్లు స‌మాచారం. ఇక గ‌తేడాది మెగా మేన‌ల్లుడు రెండు చిత్రాల‌తో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన విష‌యం తెలిసిందే. వాటిలో విరూపాక్ష సూప‌ర్ హిట్ కాగా, మామ‌య్య ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో క‌లిసి న‌టించిన బ్రో మూవీ ప‌ర్వాలేద‌నిపించింది.   

Latest News
 
‘లక్కీభాస్కర్' ప్రీ రిలీజ్ కు డేట్ ఫిక్స్ Fri, Oct 25, 2024, 08:27 PM
'డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్' విడుదల అప్పుడేనా? Fri, Oct 25, 2024, 08:13 PM
త్వరలోనే హీరోయిన్ గా జోవిక ఎంట్రీ ? Fri, Oct 25, 2024, 08:13 PM
అశ్వత్ మరిముత్తుతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించిన శింబు Fri, Oct 25, 2024, 08:06 PM
మైసూరులో 'RC16' ఫస్ట్ షెడ్యూల్? Fri, Oct 25, 2024, 07:58 PM