పుష్ప-2 నాన్‌ థియేట్రికల్‌ బిజినెస్‌ను అధికారికంగా ప్రకటించిన నిర్మాతలు

by సూర్య | Thu, Oct 24, 2024, 07:21 PM

అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం 'పుష్ప-2' ది రూల్‌. సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీమేకర్స్‌ అండ్ సుకుమార్‌ రైటింగ్స్‌లు కలిసి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. 'పుష్ప' దిరైజ్‌ చిత్రంతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాందించుకున్న అల్లు అర్జున్‌ నటిస్తున్న ఈ చిత్రం గురించి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ప్రస్తుతం చిత్రీకరణతో పాటు నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని డిసెంబరు 6న విడుదల చేస్తున్నామని గతంలో ప్రకటించారు మేకర్స్‌. అయితే ఈ చిత్రాన్ని అనుకున్న డేట్‌ కంటే ఒకరోజు ముందుగానే డిసెంబర్‌ 5న విడుదల చేస్తున్నట్లు తాజాగా ప్రకటించారు మేకర్స్‌. గురువారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఈ విషయాన్ని తెలిపారు. ఈ పాత్రికేయుల సమావేశంలో చిత్ర నిర్మాతలతో పాటు పుష్ప-2 చిత్రాన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తున్న డిస్ట్రిబ్యూటర్స్‌ కూడా పాల్గొన్నారు. ఇండియా లెవల్‌లో అత్యధిక థియేటర్స్‌లో పాన్‌ ఇండియా లెవల్‌ పుష్ప-2 విడుదల చేస్తున్నామని, కలెక్షన్ల పరంగా పుష్ప-2 ది రూల్‌ సరికొత్త రికార్డులు క్రియేట్‌ చేసే అవకాశం వుందని పంపిణీదారులు తెలిపారు. 'పుష్ప-2' దిరూల్‌ చిత్రం ఊహించిన దాని కంటే పదిరెట్లు అద్భుతంగా వుండబోతుందని, అందరి అంచనాలను పుష్ప-2 అందుకుంటుందని, దేశవ్యాప్తంగా నిర్మాతలుగా పుష్ప ఫ్రాంఛైజీ మంచి గుర్తింపు నిచ్చిందని తెలిపారు నిర్మాతలు.  ఇక పుష్ప-2 నాన్‌ థియేట్రికల్‌ రైట్స్‌ రూపంలో 420 కోట్ల బిజినెస్‌ చేసిందని, థియేట్రికల్‌ బిజినెస్‌తో కలుపుకుని 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసిందని ఓ ప్రశ్నకు సమాధానంగా నిర్మాతలు తెలిపారు

Latest News
 
రష్మికకు సెక్యూరిటీ పెంపు.. కారణం ఏంటంటే? Thu, Oct 24, 2024, 08:18 PM
రేపు థియేటర్స్ లో సందడి చేయనున్న 'పోటెల్' Thu, Oct 24, 2024, 07:47 PM
రన్ టైమ్ ని లాక్ చేసిన 'అమరన్‌' Thu, Oct 24, 2024, 07:41 PM
యూట్యూబ్ ట్రేండింగ్ లో 'మెకానిక్ రాకీ' ట్రైలర్ Thu, Oct 24, 2024, 07:38 PM
'కంగువ' ఆడియో లాంచ్ కి వెన్యూ ఖరారు Thu, Oct 24, 2024, 07:33 PM