అది అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథ

by సూర్య | Tue, Oct 22, 2024, 11:18 PM

మహేశ్‌బాబు హీరోగా ఎస్‌.ఎస్‌.రాజమౌళి 'ఎస్‌ఎస్‌ఎంబీ29’ వర్కింగ్‌ టైటిల్‌లో ఈ చిత్రం రూపొందించనున్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్‌, పాన్‌ వరల్డ్‌ స్థాయిలో పాపులర్‌ అయిన ఆర్టిస్ట్‌లతో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రం రూపొందనుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయి. తాజాగా రాజమౌళి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. ఓ అంతర్జాతీయ కార్యక్రమానికి హాజరైన ఆయన.. మహేశ్‌తో తీస్తున్న సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ చిత్రంలో  ఆర్‌ఆర్‌ఆర్‌లో ఉన్న జంతువుల కంటే ఎక్కువ జంతువులు ఉంటాయని చెప్పారు.  ‘నాకు జంతువులంటే ఇష్టం. 'ఆర్‌ఆర్‌ఆర్‌’తో సహా గతంలో నేను తీసిన సినిమాల్లో జంతువు?ను ఉపయోగించాను. ఒక విషయం అయితే కచ్చితంగా చెప్పగలను. ‘


ఆర్‌ఆర్‌ఆర్‌’ కంటే ఎక్కువ జంతువులు నా నెక్ట్స్‌ మూవీస్‌లో ఉంటాయి’ అని అన్నారు. కొత్త టెక్నాలజీతో కనులు చెదిరే గ్రాఫిక్స్‌తో వెండితెరను కలర్‌ఫుల్‌ చేసే జక్కన్న ఈ చిత్రం కోసం ఏఐ టెక్నాలజీని ఉపయోగించనున్నాడట. ప్రస్తుతం దానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయడానికి పలు క్లాసులకు హాజరవుతున్నారు. సినిమాలకు అద్భుతమైన విజువల్స్‌ అందించే హాలీవుడ్‌ సంస్థ ‘ఏ స్టూడియో’తో కలిసి ఆయన పనిచేస్తున్నారు. ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా తెరకెక్కిస్తారని టాక్‌ ఉంది. కథకు ఉన్న ప్రాధాన్యం దృష్ట్యా ఒక పార్ట్‌లో చెబితే పనికాదని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. అమెజాన్‌ అడవుల నేపథ్యంలో సాగే అడ్వెంచర్‌ కథ ఇదని ప్రచారంలో ఉంది. ఈ సినిమా షూటింగ్‌ జనవరిలో ప్రారంభం కానుందని ఇటీవల కథా రచయిత   విజయేంద్రప్రసాద్‌ చెప్పారు. కథ రాయడానికి దాదాపు రెండేళ్లు టైమ్‌ పట్టిందన్నారు. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్‌.నారాయణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక మహేశ్‌ కూడా పొడవాటి జుట్టు, గడ్డంతో పాత్రకు తగ్గట్టు మేకోవర్‌ అవుతున్నారు.

Latest News
 
లాజిక్‌ మిస్సవ్వదు Tue, Oct 22, 2024, 11:29 PM
రామ్‌చరణ్‌ అరుదైన గౌరవం Tue, Oct 22, 2024, 11:28 PM
పెళ్లి పీటలెక్కనున్న రమ్య పాండియన్ Tue, Oct 22, 2024, 11:28 PM
ఆమెతో తప్పకుండా సినిమా చేస్తా Tue, Oct 22, 2024, 11:26 PM
ఆనందంలో 'వేట్టయన్‌- ద హంటర్‌' టీం Tue, Oct 22, 2024, 11:25 PM