ఆ ప‌ద‌విలోకి పోసాని?

by సూర్య | Mon, Jun 17, 2019, 11:20 PM

ఆంధ్రప్ర‌దేశ్ః ఎన్నికలల‌లో వైసిపి అధినేత‌ జగన్ మోహన్ రెడ్డికి నేరుగా తెలుగు సినీ పరిశ్రమ భారీగా మద్దతుఇవ్వ‌టంతో పాటు మోహన్ బాబు, పోసాని కృష్ణ మురళి, పృథ్వి, అలీ,జీవిత రాజశేఖర్, జయసుధ  త‌దిత‌రులు ప్ర‌చార స‌భ‌ల‌లో పాల్గొన్నారు కూడా .  ఇక వైసీపీ అధికారంలోకి రావ‌టంతో  త‌న‌కు మ‌ద్ద‌తుగా నిల‌చిన‌ సినిమా వాళ్ళకి సిఎం జ‌గ‌న్ ఏ ప‌ద‌వులు ఇస్తారా? అంటూ ప‌లు రూమ‌ర్లు ఫిలింన‌గ‌ర్‌లో  వినిపిస్తున్నాయి.  కాగా తొలి నుంచి వైసీపికి బాస‌ట‌గా నిల‌చిన న‌టుడు ద‌ర్శ‌కుడు పోసాని కృష్ణమురళికి వైసీపీ తరపున శాస‌న‌మండ‌లికి పంపాల‌ని ఆ పార్టీ సిద్దంగా ఉంద‌ని ఓ గుస‌గుస ఇండస్ట్రీలో వినిపిస్తుంటే,  ఆంధ్రప్రదేశ్ సినీ,టీవీ రంగానికి సంబదించిన ఏపి చ‌ల‌న చిత్ర అభివృద్ధి సంస్ధ  చైర్మన్ కావాల‌ని పోసాని త‌న స‌న్ని హితుల ద్వారా జ‌గ‌న్‌కి చెప్పించిన‌ట్టు స‌మాచారం. ఇటీవ‌ల ఓ టివి చాన‌ల్‌కి పోసాని ఇంట‌ర్వూ ఇస్తూ,  పార్టీ గెలిచిన వెంటనే వైసీపీ పెద్దలు నన్ను కలిసి ఏమైనా పదవి కావాలా అని అడిగారు. నాకేమి వద్దు, ఎలాంటి స్వార్థం లేకుండా జగన్ కోసం పనిచేస్తానని చెప్పను.  మురళి నువ్వు ఆ పదవిలో పనిచేస్తే బాగుంటుందని చెప్పి,  అప్పగిస్తే చేయటానికి సిద్ధంగా వున్నానంటూ తన మనస్సులోని కోరికని బయటపెట్టాడాన్ని ఉదాహ‌ర‌ణ‌గా చెపుతున్నారు. 


 

Latest News
 
నటి వరలక్ష్మి శరత్ కుమార్ సంచలన వ్యాఖ్యలు.. Thu, May 02, 2024, 12:41 PM
ఈ సినిమా నాకు మర్చిపోలేని అనుభూతిని ఇచ్చింది : యాక్టర్ నిఖిల్ Thu, May 02, 2024, 11:26 AM
ప్రముఖ గాయని కన్నుమూత Thu, May 02, 2024, 10:25 AM
'ప్రసన్నవదనం' లో ఆధ్య గా పాయల్ రాధా కృష్ణ Wed, May 01, 2024, 09:18 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'ది వారియర్' Wed, May 01, 2024, 09:18 PM