'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీకి తేదీ లాక్

by సూర్య | Tue, Oct 22, 2024, 02:53 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో సెప్టెంబర్ 28న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. తాజాగా డిజిటల్ ప్లాట్ఫారం ఈ సినిమా అక్టోబర్ 27న తెలుగు, తమిళ్, మళయాలం, హిందీ, కన్నడలో స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు డిజిటల్ ప్లాట్ఫారం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
రామ్ చరణ్ కి మేడమ్ టుస్సాడ్స్ ఆఫ్ ది ఫ్యూచర్ అవార్డు Tue, Oct 22, 2024, 04:50 PM
'భూల్ భూలయ్యా 3' నుండి జానా సంజహోన సాంగ్ రిలీజ్ Tue, Oct 22, 2024, 04:42 PM
'దేవర పార్ట్ 1' నుండి ఆయుధ పూజ వీడియో సాంగ్ అవుట్ Tue, Oct 22, 2024, 04:39 PM
పొటెల్ పెద్ద మనసుతో తీసిన చిన్న సినిమా - సందీప్ రెడ్డి వంగా Tue, Oct 22, 2024, 04:34 PM
10 కోట్ల పాన్ మసాలా యాడ్ డీల్ కి నో చెప్పిన బాలీవుడ్ స్టార్ నటుడు Tue, Oct 22, 2024, 04:26 PM