'సత్యం సుందరం' డిజిటల్ ఎంట్రీ అప్పుడేనా?

by సూర్య | Sat, Oct 19, 2024, 05:00 PM

సి. ప్రేమ్ కుమార్‌ దర్శకత్వంలో కోలీవుడ్ నటుడు కార్తీ నటించిన 'మెయ్యళగన్' సెప్టెంబర్ 27న విడుదల అయ్యింది. ఈ సినిమా తెలుగులో సత్యం సుందరం అనే టైటిల్ తో సెప్టెంబర్ 28న విడుదల అయ్యింది. ఈ సినిమాని తెలుగులో ప్రముఖ ప్రొడక్షన్ బ్యానర్ ఆసియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్ LLP విడుదల చేసింది. ఈ ప్రాజెక్ట్‌కి దర్శకత్వం చేయడమే కాకుండా, ప్రేమ్ కుమార్ ఈ సినిమాకి కథ, స్క్రీన్‌ప్లే మరియు డైలాగ్‌లు రాశారు. కార్తీ నటించిన ఈ చిత్రం బ్రేక్ ఈవెన్‌లోకి ప్రవేశించి లాభాలను ఆర్జించడం కేక్‌వాక్ అవుతుంది. ఈ సినిమా యొక్క డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ఫ్లిక్ సొంతం చేసుకుంది. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా అక్టోబర్ 25న స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అరవింద్ స్వామి కూడా ఈ సినిమాలో ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఈ చిత్రంలో రాజ్‌కిరణ్, శ్రీ దివ్య, స్వాతి కొండే, దేవదర్శిని, జయప్రకాష్, శ్రీ రంజని, ఇళవరసు, కరుణాకరన్, శరణ్, రేచల్ రెబెక్కా, ఆంథోని, రాజ్‌కుమార్, ఇందుమతి, రాణి సంయుక్త, కాయల్ సుబ్రమణి, అశోక్ పాండియన్, తదితరులు కీలక పాత్రలలో నటించారు. గోవింద్ వసంత ఈ సినిమాకి స్వరాలు సమకూరుస్తున్నారు. 2డి ఎంటర్‌టైన్‌మెంట్‌పై జ్యోతిక మరియు సూర్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు, రాజశేఖర్ కర్పూరసుందరపాండియన్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.

Latest News
 
'బౌగెన్‌విల్లా' డే వన్ కలెక్షన్ రిపోర్ట్ Sat, Oct 19, 2024, 07:04 PM
తన డ్రీమ్ హోమ్ లో హన్సిక Sat, Oct 19, 2024, 06:57 PM
ప్రజలు కేవలం వినోదం కోసమే యూట్యూబ్ రివ్యూలను చూస్తారు - నాగ వంశి Sat, Oct 19, 2024, 06:53 PM
'గేమ్ ఛేంజర్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 19, 2024, 06:47 PM
'మట్కా' లో సాహు గా నవీన్ చంద్ర Sat, Oct 19, 2024, 06:44 PM