'గేమ్ ఛేంజర్' కర్ణాటక రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Sat, Oct 19, 2024, 06:47 PM

శంకర్ షణ్ముగం దర్శకత్వంలో మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి గేమ్ ఛేంజర్ అనే టైటిల్ ని లాక్ చేసారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ యాక్షన్ డ్రామా చిత్రం తెలుగు, తమిళం మరియు హిందీలో జనవరి 10, 2025న విడుదల కానుంది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క కర్ణాటక వెర్షన్ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ ని బెంగళూరు కుమార్ ఫిలిమ్స్ బ్యానర్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ పొలిటికల్ థ్రిల్లర్‌లో బాలీవుడ్ నటి కియారా అద్వానీ కథానాయికగా నటించింది. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రంలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జె సూర్య, నవీన్ చంద్ర మరియు మరికొంతమంది కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు. 

Latest News
 
రాశి ఖన్నా గ్లామర్ ట్రీట్‌ Sat, Oct 19, 2024, 08:54 PM
ఈ హాట్ బ్యూటీని పెళ్లాడనున్న సుప్రీమ్ హీరో? Sat, Oct 19, 2024, 08:54 PM
చండీ హోమం చేసిన రేణూ దేశాయ్‌ Sat, Oct 19, 2024, 08:39 PM
'గేమ్ ఛేంజర్' స్పెషల్ సాంగ్ కోసం భారీ బడ్జెట్ Sat, Oct 19, 2024, 07:42 PM
బిగ్ బాస్ 8 తెలుగు: ట్రోఫీ కోసం పోరాడుతున్న ఈ ఇద్దరు ప్రముఖులు Sat, Oct 19, 2024, 07:31 PM