తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వును కలపడంపై మోహన్ బాబు స్పందన

by సూర్య | Sat, Sep 21, 2024, 07:09 PM

తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు ఉందనే ఆరోపణలపై సినీ నటుడు మోహన్ బాబు స్పందించారు. ఈ వార్త వినగానే ఒక భక్తుడిగా తాను తల్లడిల్లిపోయానని చెప్పారు. ప్రపంచ వ్యాప్తంగా ప్రతి హిందువు ఎంతో భక్తితో పూజించే కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి అని పేర్కొన్నారు. 3 నెలల క్రితం వరకు స్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలుపుతున్నారని తెలియగానే దిగ్భ్రాంతికి గురయ్యానని వెల్లడించారు. స్వామి దగ్గర ఇలా జరగడం ఘోరం, పాపం, ఘోరాతి ఘోరం, అత్యంత నీచం, హేయం, అరాచకమని తెలిపారుస్వామివారి లడ్డూలో జంతువుల కొవ్వును కలపడం నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని తన మిత్రుడు, ఆత్మీయుడు, సీఎం చంద్రబాబును హృదయపూర్వకంగా కోరుకుంటున్నానని వివరించారు. కలియుగదైవం శ్రీనివాసుడి ఆశీస్సులను తన మిత్రుడు అందుకుని నిండు నూరేళ్లు చల్లగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానని తెలిపారు.మోహన్ బాబు యూనివర్శిటీ నుంచి కనిపించే తిరుమల క్షేత్రాన్ని చూసి తనతో పాటు వేలాది మంది విద్యార్థులు, ఉపాధ్యాయులు భక్తిపూర్వకంగా నమస్కరించుకుంటూ ఉంటామని తెలిపారు. ఈ మేరకు ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM