ఈ నెల 20న విడుదలకానున్న ‘కోళిపన్నై చెల్లదురై’

by సూర్య | Mon, Sep 16, 2024, 08:36 PM

నిర్మాత తనను నమ్మి పెట్టుబడిపెట్టినప్పటికీ... దాన్ని పొదుపుగా ఖర్చు చేసే దర్శకుల్లో శీను రామస్వామి ఒకరని ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి అన్నారు. విజన్‌ హౌస్‌ పతాకంపై డాక్టర్‌ పి.అరుళానందం, మ్యాథ్యూ అరుళానందం సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘కోళిపన్నై చెల్లదురై’ . శీను రామస్వామి దర్శకత్వంలో ఏగన్, బ్రిగిడ హీరో హీరోయిన్లుగా యోగిబాబు  ప్రధాన పాత్రల్లో నటించారు. ఇతర పాత్రల్లో సత్యదేవి, భవ చెల్లదురై, లియో శివకుమార్‌, కుట్టిపులి దినేష్‌, మానస్వి, రియాజ్‌ తదితరులు నటించారు. ఈ నెల 20వ తేదీన శక్తి ఫిలిమ్‌ ఫ్యాక్టరీ విడుదల చేయనుంది. ప్రముఖ నటుడు విజయ్‌ సేతుపతి ముఖ్య అతిథిగా పాల్గొని ఆడియో రిలీజ్‌ చేశారు.ఈ సందర్భంగా విజయ్‌ సేతుపతి మాట్లాడుతూ.. ‘శీను రామస్వామి దర్శకత్వంలో నాలుగు చిత్రాల్లో నటించాను. ఆయన కథ చెప్పేటపుడు గాని సన్నివేశాన్ని చిత్రీకరించే సమయంలో ఎపుడు కూడా తడబడటం చూడలేదు. తనను నమ్మి పెట్టుబడి పెట్టే నిర్మాతను ఏదో రూపంలో ఆదుకునేలా పొదుపుగా ఖర్చు చేసి చిత్రాన్ని పూర్తి చేసే దర్శకుడు. అలాంటి దర్శకుడి ద్వారా హీరోగా ఏగన్‌ పరిచయం కావడం అతడి అదృష్టం అన్నారు. నటుడు యోగిబాబు మాట్లాడుతూ, ‘నా పుట్టిన రోజున ఈ చిత్రానికి శ్రీకారం చుట్టాం. అనుకున్నట్టుగానే నిర్మాణం పూర్తి చేశాం. నిర్మాతకు ధన్యవాదాలు. జాతీయ అవార్డు గ్రహీత శీను రామస్వామితో పనిచేయడం ఎంతో సంతోషంగా ఉంది. ఇందులో ఒక మంచి పాత్ర ఇచ్చారు. సాధారణంగా ప్రతి చిత్రంలో నేను కౌంటర్‌ ఇస్తుంటాను. కానీ, ఇందులో అలాంటి అవకాశం లేకుండా పోయిందన్నారు.

Latest News
 
నేడు విడుదల కానున్న 'స్వాగ్' మూడవ సింగల్ Sat, Sep 21, 2024, 03:02 PM
'వెట్టయన్' ప్రివ్యూ అవుట్ Sat, Sep 21, 2024, 02:57 PM
దీపావళి రేస్ లో 'షణ్ముఖ' Sat, Sep 21, 2024, 02:51 PM
'బాలు గాని టాకీస్' డిజిటల్ స్ట్రీమింగ్ ఎప్పుడంటే...! Sat, Sep 21, 2024, 02:46 PM
ఇలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : ప్రణీత Sat, Sep 21, 2024, 02:43 PM