by సూర్య | Mon, Sep 16, 2024, 08:20 PM
ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఆయనపై అత్యాచారం కేసు నమోదవ్వడంతో జనసేన పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. జనసేన పార్టీలో జానీ మాస్టర్ క్రీయాశీలకంగా పనిచేస్తుండటంతో కేసు నేపథ్యంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని షేక్ జానీని పార్టీ ఆదేశించింది. ఈమేరకు అధికారిక ప్రకటనను జనసేన విడుదల చేసింది.వేములపాటి అజయ్ పేరుతో ఈ ప్రకటన విడుదలైంది. జానీ మాస్టర్పై రాయదుర్గం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైన క్రమంలో పార్టీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకుంది. తక్షణమే ఈ ఆదేశాలు అమలులోకి వస్తాయని ప్రకటనలో పేర్కొన్నారు. కొంతకాలంగా జానీ మాస్టర్ జనసేన పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. పవన్ కళ్యాణ్కు ఆయన మద్దతు ఇస్తున్నారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లోనూ జనసేన పార్టీకి ప్రచారం చేశారు.
Latest News