బిజీ బిజీగా రకుల్‌

by సూర్య | Mon, Jun 17, 2024, 01:15 PM

తన ప్రియుడు జాకీ భగ్నానీతో వివాహం అనంతరం మళ్లీ సినిమాలతో బిజీ అయింది రకుల్‌ప్రీత్  సింగ్‌. ప్రస్తుతం ఆమె చేతిలో మూడు సినిమాలున్నాయి. అయితే 'కొండపొలం' చిత్రం తర్వాత తెలుగులో మరో అవకాశం అందుకోలేదు. ప్రస్తుతం ఆమె దృష్టంతా బాలీవుడ్‌పైనే ఉంది. తాజాగా అజయ్‌ దేవగణ్‌ సరసన ‘దే దే ప్యార్‌ దే 2’  చిత్రంలో నటిస్తోంది రకుల్‌. 2019లో విడుదలై విజయం సాధించిన  ‘దే దే ప్యార్‌ దే’కి ఈ చిత్రం కొనసాగింపుగా రూపొందుతోంది. అన్షుల్‌ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభించారు రకుల్‌. ఈ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో మరోసారి అజయ్‌ దేవగణ్‌తో కలిసి నటించడం ఆనందంగా ఉందని తెలిపింది. ఇంకా పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. ‘ఆడియన్స్ కు , అభిమానులకు డబుల్‌ డోస్‌ ధమాకా అందించడానికి మళ్లీ వస్తున్నాం. మరోసారి అయేషా పాత్రలో నటించడం ఆనందంగా ఉంది. అజయ్‌, చిత్రబృందంతో కలిసి మరోసారి పనిచేసే అవకాశం రావడం గొప్ప విషయం. సెట్లోకి అడుగు పెట్టిన మొదటి రోజు సొంతింటికి వచ్చిన అనుభూతి కలిగింది. ఎందుకంటే దక్షిణాదిలో పనిచేసినప్పుడు ప్రేక్షకులు నన్ను ఎలా ఆదరించారో.. బాలీవుడ్‌లో మళ్లీ ఈ సినిమాతోనే అభిమానుల నుంచి అలాంటి ప్రేమను సొంతం చేసుకోగలిగాను. తొలిభాగం కన్నా మరింత భిన్నంగా ఈ చిత్రం రాబోతుంది’’ అని రకుల్‌ అన్నారు. అలాగే త్వరలోనే ఇండియన్-2 చిత్రంతో సందడి చేయనుంది. 

Latest News
 
నేడే 'సారంగపాణి జాతకం' ఫస్ట్ సింగల్ విడుదల Sat, Oct 26, 2024, 02:54 PM
బిగ్ బాస్ 8 తెలుగు : ఈ వారం మరో క్రేజీ ఎలిమినేషన్ Sat, Oct 26, 2024, 02:49 PM
'లక్కీ బాస్కర్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌కి చీఫ్ గెస్ట్స్ గా వస్తుంది ఎవరంటే...! Sat, Oct 26, 2024, 02:45 PM
'దేవకి నందన వాసుదేవ' వరల్డ్ వైడ్ థియేటర్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్ Sat, Oct 26, 2024, 02:40 PM
వరల్డ్ టెలివిషన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'భోళా శంకర్' Sat, Oct 26, 2024, 02:35 PM