'నింద' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధిగా ప్రముఖ హీరో

by సూర్య | Sat, Jun 15, 2024, 04:03 PM

రాజేష్ జగన్నాధం దర్శకత్వంలో టాలెంటెడ్ హీరో వరుణ్ సందేశ్ ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'నింద' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ రేపు సాయంత్రం 6 గంటలకి హైటెక్ సిటీలోని హోటల్ అవసలో జరుగనుంది. ఈ ఈవెంట్ కి టాలీవుడ్ హీరో నిఖిల్ చీఫ్ గెస్ట్ గా హాజరుకానున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించారు. అన్నీ, తనికెళ్ల భరణి, భద్రమ్, సూర్య కుమార్, చత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై ఈ సినిమాలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంతు ఓంకార్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా జూన్ 21, 2024న విడుదల కానుంది.

Latest News
 
నాకంటే పెద్దవారితో స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడానికి నాకు ఎలాంటి ఇబ్బందీ లేదు: ఊర్వశీ రౌతేలా Sat, Oct 26, 2024, 08:58 PM
'బగీరా' టీమ్ తో సుమ స్పెషల్ ఇంటర్వ్యూ Sat, Oct 26, 2024, 08:52 PM
లోకేష్ కనగరాజ్ షార్ట్ ఫిల్మ్ గురించిన అప్డేట్ Sat, Oct 26, 2024, 08:47 PM
నేను చాలా సంతోషంగా ఉన్నా: రేణూ దేశాయ్‌ Sat, Oct 26, 2024, 08:47 PM
'లక్కీ బాస్కర్' రన్ టైమ్ లాక్ Sat, Oct 26, 2024, 07:18 PM