తెలుగురాష్ట్రాల్లో 'రాజు యాదవ్' 3 రోజుల గ్రాస్ ఎంతంటే...!

by సూర్య | Tue, May 28, 2024, 05:52 PM

కృష్ణమాచారి దర్శకత్వంలో జబర్దస్త్ ఫేమ్ కమెడియన్ గెటప్ శ్రీను కథానాయకుడిగా నటించిన 'రాజు యాదవ్' సినిమా మే 24, 2024న థియేట్రికల్ విడుదల అయ్యింది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా 3 రోజులలో ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ బాక్స్ఆఫీస్ వద్ద 2.11 కోట్ల గ్రాస్ ని వసూళ్లు చేసినట్లు సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాలో అంకితా ఖరత్ మహిళా ప్రధాన పాత్రలో కనిపించనుంది. ఆనంద చక్రపాణి, రాకెట్ రాఘవ, మిర్చి హేమంత్, జబర్దస్త్ సన్నీ, సంతోష్ కల్వచెర్ల మరియు ఇతరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాయి వరుణవి క్రియేషన్స్‌, చరిష్మా డ్రీమ్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకాలపై కె ప్రశాంత్‌ రెడ్డి, రాజేష్‌ కల్లేపల్లి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతం అందించారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM