డిజిటల్ ఎంట్రీ ఇచ్చేసిన 'చిత్రం చూడరా'

by సూర్య | Thu, May 09, 2024, 03:27 PM

ఆర్ఎన్ హర్షవర్ధన్ దర్శకత్వంలో టాలీవుడ్ యంగ్ హీరో వరుణ్ సందేశ్ నటించిన 'చిత్రం చూడరా' సినిమా యొక్క డిజిటల్ రైట్స్ ని ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా మే 9, 2024న డిజిటల్ ప్రసారానికి అందుబాటులోకి వచ్చింది. ఈ విషయాన్ని స్ట్రీమింగ్ ప్లాట్ఫారం అధికారంగా సరికొత్త పోస్టర్ ని విడుదల చేసి ప్రకటించింది.


ఈ చిత్రంలో అల్లరి రవిబాబు, తనికెళ్ల భరణి, రాజా రవీంద్ర, శివాజీరాజా, శీతల్ భట్, మీనా కుమారి, అన్నపూర్ణమ్మ, ధన్‌రాజ్, కాశీ విశ్వనాథ్‌లు కీలక పాత్రలు పోషిస్తున్నారు. బిఎమ్ సినిమాస్ బ్యానర్‌పై శేషు మారంరెడ్డి, బోయపాటి భాగ్యలక్ష్మి ఈ చిత్రాన్ని నిర్మించారు. ధన తుమ్మల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి రాధన్ సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
75M+ స్ట్రీమింగ్ నిమిషాలను క్రాస్ చేసిన 'గీతాంజలి మళ్ళీవచ్చింది' Mon, May 20, 2024, 02:18 PM
ఇండియా వైడ్ గా ట్రేండింగ్ అవుతున్న 'లవ్ గురు' Mon, May 20, 2024, 02:15 PM
లవ్ మి - ఇఫ్ యు డేర్ : రావాలి రా సాంగ్ విడుదలకి టైమ్ లాక్ Mon, May 20, 2024, 02:13 PM
విష్ణు మంచు 'కన్నప్ప' లో పార్వతిగా లేడీ సూపర్ స్టార్ Mon, May 20, 2024, 02:11 PM
తొలిసారి ఓటేసిన అక్షయ్ కుమార్ Mon, May 20, 2024, 02:11 PM