'శబ్ధం' టీజర్ అవుట్

by సూర్య | Fri, Apr 12, 2024, 07:19 PM

తెలుగులో చివరిగా ది వారియర్‌లో మరియు తమిళంలో పార్టనర్ లో కనిపించిన ఆది పినిశెట్టి ప్రస్తుతం దర్శకుడు అరివళగన్ వెంకటాచలం దర్శకత్వం వహిస్తున్న 'శబ్ధం' అనే థ్రిల్లర్ చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. తాజాగా మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియన్ చిత్రం యొక్క టీజర్ ని విడుదల చేసారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు.


వైశాలి సినిమాకి పని చేసిన తర్వాత నటుడు మరియు దర్శకుల మధ్య రెండవ సహకారంగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ పై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రంలో సిమ్రాన్, లక్ష్మీ మీనన్, లైలా, రెడిన్ కింగ్స్లీ మరియు ఇతరులు కీలక పాత్రల్లో నటించారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ ప్రాజెక్ట్‌కి థమన్ సంగీత దర్శకుడిగా ఆన్‌బోర్డ్‌లో ఉన్నారు. ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ మరియు ఆల్ఫా ఫ్రేమ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

Latest News
 
చిరంజీవికి ANR అవార్డు అందజేయనున్న బాలీవుడ్ బిగ్ బి Fri, Oct 25, 2024, 05:01 PM
మెగా అభిమానులు 'పుష్ప 2' కి సపోర్ట్ చేస్తారంటున్న చిత్ర నిర్మాత Fri, Oct 25, 2024, 04:55 PM
బ్రౌన్ చీరలో కియారా అద్వానీ స్టన్స్ Fri, Oct 25, 2024, 04:50 PM
తనను ముద్దు పెట్టుకోవడానికి స్టార్ హీరోయిన్ నిరాకరించిందని చెప్పిన ప్రముఖ నటుడు Fri, Oct 25, 2024, 04:45 PM
గార్మెంట్ పరిశ్రమలో తన అనుభవాన్ని పంచుకున్న సూర్య Fri, Oct 25, 2024, 04:40 PM