'శశివదనే' ఓవర్సీస్ రైట్స్ ని సొంతం చేసుకున్న ప్రముఖ బ్యానర్

by సూర్య | Mon, Mar 04, 2024, 03:38 PM

సాయి మోహన్ ఉబ్బన దర్శకత్వంలో పలాస 1978 ఫేమ్ రక్షిత్ అట్లూరి ఒక ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి మూవీ మేకర్స్ 'శశివదనే' అనే టైటిల్ ని లాక్ చేసారు. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా ఓవర్సీస్ రైట్స్ ని ది విలేజ్‌ గ్రూప్ సొంతం చేసుకున్నట్లు ప్రకటించారు.


ఈ సినిమా ఏప్రిల్ 5, 2024న విడుదల కానుంది. ఈ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌ లో రక్షిత్ అట్లూరికి జోడిగా కోమలీ ప్రసాద్ నటిస్తుంది. ఈ సినిమాలో ప్రవీణ్ యెండమూరి, శ్రీమన్, దీపక్ ప్రిన్స్, జబర్దస్త్ బాబీ కీలక పాత్రలు పోషించారు.


గౌరీ నాయుడు సమర్పణలో అహితేజ బెల్లంకొండ SVS కన్‌స్ట్రక్షన్స్ ప్రై.లి. లిమిటెడ్ మరియు AG ఫిల్మ్ కంపెనీతో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శరవణ వాసుదేవన్ మరియు అనుదీప్ దేవ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM