ఐదు మంది కథానాయికలతో చిరు

by సూర్య | Fri, Feb 23, 2024, 06:34 PM

మెగాస్టార్‌ చిరంజీవి  కథానాయికుడిగా తెరకెక్కుతున్న ‘విశ్వంభర’  చిత్రంలో మూడు నుంచి ఐదు మంది  కథానాయికలకు ఆస్కారం ఉందని మొదటి నుంచి టాక్‌ వినిపిస్తోంది. మెయిన్ హీరోయిన్ గా  త్రిషను ఖరారు చేశారు. ఇటీవల ఆమె సెట్‌లో అడుగుపెట్టింది. స్టాలిన్ తర్వాత చిరు, త్రిష కలయికలో 18 ఏళ్ల తర్వాత వస్తున్న చిత్రమిది. అలాగే ఈ చిత్రంలో మరో ఇద్దరు కథానాయికలు ఖరారు అయినట్లు సమాచారం. ఇషాచావ్లా, సురభి  ఈ సినిమాలో అవకాశాన్ని సొంతం చేసుకున్నారు. ఇప్పటికే వీరిద్దకూ సెట్‌లో అడుగుపెట్టగా పలు సన్నివేశాలు కూడా చిత్రీకరించారని తెలుస్తోంది. ప్రస్తుతం చిరంజీవి విదేశాల్లో ఉన్నారు.ఈ నెల 26 నుంచి హైదరాబాద్‌లో మరో షెడ్యూల్‌ మొదలవుతుంది. వశిష్ట ఈ సినిమాకు దర్శకత్వం  వహిస్తున్నారు.  ఫాంటసీ కథతో రూపొందుతున్న ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్‌ పతాకంపై వంశీ, ప్రమోద్‌, విక్రమ్‌ నిర్మిస్తున్నారు. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.

Latest News
 
'పొటెల్' ట్రైలర్ అవుట్ Fri, Oct 18, 2024, 06:41 PM
డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చిన 'ఉత్సవం' Fri, Oct 18, 2024, 06:34 PM
ఈ వారం OTTలో విడుదల కానున్న సిరీస్ మరియు సినిమాలు Fri, Oct 18, 2024, 05:27 PM
అఖిల్ తదుపరి సినిమాపై తాజా అప్డేట్ Fri, Oct 18, 2024, 05:23 PM
డైరెక్టర్ జ్యోతి కృష్ణ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసిన 'హరి హర వీర మల్లు' టీమ్ Fri, Oct 18, 2024, 05:18 PM