by సూర్య | Wed, Dec 06, 2023, 05:51 PM
టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ సినిమాటోగ్రాఫర్ నుండి దర్శకుడిగా మారిన కార్తీక్ ఘట్టమ్నేనితో తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ థ్రిల్లర్ కి 'ఈగిల్' అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసారు. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ పాడిన "ఆడు మచా" అనే మొదటి సింగిల్ ను మూవీ మేకర్స్ విడుదల చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ పాట ఇప్పుడు యూట్యూబ్ లో 2 మిలియన్ వ్యూస్ ని సాధించింది అని మూవీ మేకర్స్ పోస్టర్ ని రిలీజ్ చేసి ప్రకటించారు.
ఈ చిత్రం 13 జనవరి 2024న విడుదల కానుంది. థ్రిల్లర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రంలో అనుపమ పరమేశ్వరన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో కావ్య థాపర్, నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ ప్రాజెక్ట్ని నిర్మిస్తుంది.