by సూర్య | Wed, Nov 29, 2023, 02:26 PM
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'ఎవరు డబ్బులిచ్చినా తీసుకోండి. కానీ ఓటు మాత్రం మీకు న్యాయం జరుగుతుందనే నాయకులకు మాత్రమే వేయండి. ఓటు మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అలాంటి ఓటును అమ్ముకోవద్దు. ప్రజలకు మంచి చేసే వారిని, నియోజకవర్గంపై పూర్తి అవగాహన కలిగిన నాయకులను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలపైనే ఉంది' అని ఆర్జీవీ సూచించారు.
Latest News