ఆ పరిచయం కొనసాగుతూనే ఉంది

by సూర్య | Mon, Sep 25, 2023, 04:29 PM

‘చార్లీ 777’తో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమై, తాజాగా ‘సప్త సాగరాలు దాటి’ చిత్రంతో మరోసారి తెలుగు ప్రేక్షకులను అలరించారు రక్షిత్‌శెట్టి. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రక్షిత్‌ ఓ ఛానల్‌ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం గురించి, కథానాయిక రష్మిక మందన్నా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2016లో విడుదలైన ‘కిర్రిక్‌ పార్టీ’ సినిమాలో రష్మిక - రక్షిత్‌ శెట్టి కలిసి పని చేశారు. యూత్‌ ఫుల్‌ లవ్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ సినిమా చిత్రీకరణలో వీరిద్దరూ ప్రేమలో పడ్డారు. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. కాకపోతే అనుకోని కారణాలతో కొన్ని నెలలకే వీరిద్దరూ విడిపోయారు. ‘రష్మిక, రిషబ్‌శెట్టి, మీరూ మంచి ేస్నహితులు కదా.. ఇప్పుడు మీ మధ్య మాటలున్నాయా? అన్న ప్రశ్నకు ‘‘రిషబ్‌ శెట్టి సంగతి నాకు తెలియదు. కానీ, రష్మిక, నేనూ ఇప్పటికీ మెసేజ్‌లు చేసుకుంటూనే ఉంటాం. నా సినిమా విడుదలైనప్పుడు విషెస్‌ తెలుపుతూ తను కూడా సందేశాలు పంపుతుంది. నేనూ తనకి పంపిస్తా. కెరీర్‌ విషయంలో ఆమె ఎన్నో కలలు కంది. వాటిని సాకారం చేసుకుంటూ ఆమె ఈ స్థాయికి వచ్చి నేషనల్‌ క్రష్‌గా గుర్తింపు పొందినందుకు ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. నా ఫోకస్‌ అంతా కెరీర్‌పైనే ఉంది’’ అని అన్నారు. ‘‘నాకు చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం. కుటుంబ సభ్యుల కోసం ఇంజినీరింగ్‌ పూర్తి చేసి ఐటీ కంపెనీలో ఉద్యోగం చేశా. ఆ తర్వాత ఫిల్మ్‌ మేకింగ్‌లో శిక్షణ తీసుకుని పరిశ్రమలోకి అడుగుపెట్టా. తొలి సినిమా తర్వాత ఉద్యోగం మానేశా. ‘సింపుల్‌ ఆగి ఒంద్‌ లవ్‌ స్టోరీ’తో నాకు మంచి బ్రేక్‌ వచ్చింది’’ అని తెలిపారు.

Latest News
 
కొత్త ఇల్లు కొన్న మృణాళిని రవి Sat, Sep 21, 2024, 08:37 PM
వైట్ శారీ లో మెరిసిన జాన్వీ కపూర్ Sat, Sep 21, 2024, 08:25 PM
'సత్యం సుందరం' ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెన్యూ ఖరారు Sat, Sep 21, 2024, 08:13 PM
ఎవరైనా మహిళలను వేధించే వారిని కఠినంగా శిక్షించాలి : ఐశ్వర్య రాజేష్ Sat, Sep 21, 2024, 08:05 PM
ప్రకాష్‌రాజ్‌కు మంచు విష్ణు స్ట్రాంగ్ కౌంటర్ Sat, Sep 21, 2024, 08:01 PM