![]() |
![]() |
by సూర్య | Fri, Mar 31, 2023, 08:57 PM
కార్తీక్ దండు దర్శకత్వంలో సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ ఒక ప్రాజెక్ట్ ని అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ రొమాన్స్ చేయనుంది. ఈ చిత్రానికి 'విరూపాక్ష' అనే టైటిల్ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ మరియు హిందీ భాషల్లో ఏప్రిల్ 21, 2023న విడుదల కానుంది.
తాజాగా ఈ సినిమా షూటింగ్ మొత్తం పూర్తయిందని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో బ్రహ్మాజీ, అజయ్, సునీల్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి.