by సూర్య | Thu, Dec 08, 2022, 01:13 PM
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నటసింహ నందమూరి బాలకృష్ణతో ఒక సినిమా చేస్తున్నట్లు అధికారకంగా ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ కాంబినేషన్ లో రానున్న సినిమా కోసం నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజగా ఈ చిత్రం ఈరోజు ఉదయం హైదరాబాద్లో ప్రారంభమైంది.
ఈ చిత్రం యొక్క అధికారిక పూజా కార్యక్రమం అభిమానుల మధ్య జరిగింది. ఈ సినిమా లాంచ్ ఈవెంట్కి బాలయ్య, అనిల్ రావిపూడి, అల్లు అరవింద్, దిల్ రాజు, సుకుమార్, నవీన్, శిరీష్ హాజరయ్యారు. దిల్ రాజు కెమెరా స్విచాన్ చేయగా, ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ క్లాప్బోర్డ్ను వినిపించారు. దర్శకుడు సుకుమార్ తొలి షాట్కి దర్శకత్వం వహించగా, నవీన్ మరియు శిరీష్ స్క్రిప్ట్ను ఎఫ్3 దర్శకుడికి అందజేశారు.
ఈ బిగ్గీలో ప్రియాంక జవాల్కర్ కథానాయికగా నటించే అవకాశం ఉంది అని వార్తలు వినిపిస్తున్నాయి. 'NBK108' ని షైన్ స్క్రీన్స్ బ్యానర్పై సాహు గారపాటి మరియు హరీష్ పెద్ది భారీ బడ్జెట్తో నిర్మించనున్నారు. ఈ చిత్రానికి ఎస్ఎస్ థమన్ సంగీతం అందించనున్నారు.
Latest News