by సూర్య | Mon, Dec 05, 2022, 11:24 PM
సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఈ ఏడాది "సర్కారువారిపాట" వంటి మాస్ మసాలా మూవీ వచ్చి, ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ఆ సినిమా తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో జట్టు కట్టిన మహేష్ ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.
దాదాపు పన్నెండేళ్ల తదుపరి ఈ హిట్ హీరో - డైరెక్టర్ కాంబో పట్టాలెక్కడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరుచుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఒక వారం రోజులపాటు దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. థమన్ కంపోజ్ చేసిన కొన్ని సాంగ్స్ ను అక్కడే విని ఫైనలైజ్ చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.
పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
Latest News