మహేష్ బాబు - త్రివిక్రమ్ ల సినిమాపై ఇంట్రెస్టింగ్ అప్డేట్..!!

by సూర్య | Mon, Dec 05, 2022, 11:24 PM

సూపర్ స్టార్ మహేష్ బాబు నుండి ఈ ఏడాది "సర్కారువారిపాట" వంటి మాస్ మసాలా మూవీ వచ్చి, ఫ్యాన్స్ ను ఫుల్ ఖుషి చేసింది. ఆ సినిమా తదుపరి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తో జట్టు కట్టిన మహేష్ ప్రస్తుతం ఆ మూవీ షూటింగ్ పనులతో బిజీగా ఉన్నారు.


దాదాపు పన్నెండేళ్ల తదుపరి ఈ హిట్ హీరో - డైరెక్టర్ కాంబో పట్టాలెక్కడంతో ఫ్యాన్స్ ఈ సినిమాపై చాలా మంచి అంచనాలను ఏర్పరుచుకున్నారు. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, మహేష్ బాబు, త్రివిక్రమ్ కలిసి ఒక వారం రోజులపాటు దుబాయ్ వెళ్లాలని నిర్ణయించుకున్నారట. థమన్ కంపోజ్ చేసిన కొన్ని సాంగ్స్ ను అక్కడే విని ఫైనలైజ్ చేయనున్నారట. ఈ మేరకు సోషల్ మీడియాలో విపరీతమైన ప్రచారం జరుగుతుంది.


పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ పై ఎస్ రాధాకృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Latest News
 
'వీరాంజనేయులు విహార యాత్ర' టీజర్ అవుట్ Fri, Jul 26, 2024, 08:34 PM
యువ దర్శకుడితో లారెన్స్ రాఘవేంద్ర స్ట్రెయిట్ తెలుగు సినిమా? Fri, Jul 26, 2024, 08:27 PM
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ తేదీని లాక్ చేసిన 'దసరా' Fri, Jul 26, 2024, 08:25 PM
తన పేరు మార్చుకున్న యంగ్ హీరో ఆకాష్ పూరి Fri, Jul 26, 2024, 08:20 PM
బిగ్ బాస్ 8 షోలో ప్రముఖ యాంకర్ Fri, Jul 26, 2024, 08:18 PM