by సూర్య | Mon, Nov 28, 2022, 06:37 PM
బుల్లితెర నటుడు ఆదర్శ్, చిత్ర శుక్ల జంటగా నటిస్తున్న చిత్రం "గీత సాక్షిగా". ఈ మూవీ పోస్టర్స్, టీజర్ ప్రేక్షకుల్లో పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసాయి.
ఈ సినిమా నుండి రీసెంట్గా రిలీజైన 'అందాల చందమామవే' అనే ఫస్ట్ లిరికల్ సాంగ్ ప్రేక్షకుల విశేష ఆదరణకు నోచుకోగా మేకర్స్ సెకండ్ సింగిల్ ను రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఖరారు చేసారు. నవంబర్ 30వ తేదీ సాయంత్రం ఐదింటికి సెకండ్ సింగిల్ 'అమ్మ మనసు' పాటను విడుదల చెయ్యబోతున్నట్టు పేర్కొంటూ మేకర్స్ స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేసారు.
ఆంథోనీ మట్టిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. గోపిసుందర్ సంగీతం అందిస్తున్నారు. రూపేష్ శెట్టి, శ్రీకాంత్ అయ్యంగార్, భరణి శంకర్, జయలలిత తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రలు పోషిస్తున్నారు.
Latest News