by సూర్య | Sun, Nov 27, 2022, 03:20 PM
ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థలో 94వ ప్రాజెక్ట్ గా రూపొందిన చిత్రం "చెప్పాలని ఉంది". ఇందులో యష్ పూరీ, స్టెఫీ పటేల్ జంటగా నటిస్తున్నారు. హామ్స్ టెక్ ఫిలిమ్స్ తో కలిసి సూపర్ గుడ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు అరుణ్ భారతి L డైరెక్టర్ కాగా, అస్లాం కెయి సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ సినిమా నుండి సెకండ్ లిరికల్ గా నీకోసం అనే బ్యూటిఫుల్ డ్యూయెట్ సాంగ్ విడుదల అయ్యింది. ఈ పాటను స్టార్ సింగర్ హరిచరణ్ పాడారు.
Latest News