by సూర్య | Thu, Nov 24, 2022, 01:21 PM
ఇరు తెలుగు రాష్ట్రాలలో రేపు విడుదల కాబోతున్న సినిమాలలో ఒకే ఒక్క స్ట్రెయిట్ తెలుగు మూవీ "ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం". AR మోహన్ డైరెక్షన్లో సీరియస్ యాక్షన్ చిత్రంగా రూపొందిన ఈ సినిమాలో అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించారు. శ్రీచరణ్ పాకాల సంగీతం అందించారు.
నవంబర్ 25న అంటే రేపు ఈ సినిమా థియేటర్లకు రాబోతుంది. మారేడుమిల్లి గ్రామ ప్రజలతో కలిసి ఒక స్కూల్ టీచర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేసిన పోరాటం ఎలా ఉంటుందో తెలియాలంటే రేపు థియేటర్లకు వెళ్లాల్సిందే.
వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్, రఘుబాబు, చమ్మక్ చంద్ర తదితరులు నటించిన ఈ చిత్రాన్ని హాస్య మూవీస్, జీ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించాయి.
ఆంధ్రప్రదేశ్, తెలంగాణాలలో సుమారు 400 థియేటర్లలో, ప్రపంచవ్యాప్తంగా 500కి పైగా థియేటర్లలో విడుదల కాబోతున్న ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా హిట్ అవ్వాలంటే నాలుగున్నర కోట్లను సంపాదించాలి.
Latest News