by సూర్య | Thu, Nov 24, 2022, 10:50 AM
సినీరంగంలో విశిష్ట సేవలందించిన వ్యక్తికి ప్రతి ఏడాది ‘సూపర్ స్టార్ కృష్ణ స్మారక అవార్డు’ను ప్రధానం చేస్తామని ‘మా’ ఏపీ అధ్యక్షుడు, డైరెక్టర్ దిలీప్ రాజా అన్నారు. తెలుగు రాష్ట్రాల ప్రజలు తమకు ఇష్టమైన ముగ్గురు నటుల పేర్లను ‘మా-ఏపీ’ కార్యాలయానికి పంపాలి. పంపిన వారి వివరాలు, ఫోన్ నెంబర్ తప్పనిసరి కాగా.. ప్రజా బ్యాలెట్ లో ఎక్కువ ఓట్లు వచ్చిన ఒకరిని అవార్డుకు జ్యూరీ ఎంపిక చేస్తుందన్నారు. తెనాలిలో జరిగే ఈ అవార్డు వేడుక తేదీని మహేశ్ బాబుతో చర్చించిన అనంతరం చెబుతామన్నారు.
Latest News