by సూర్య | Wed, Nov 23, 2022, 07:37 PM
గ్లామరస్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ కెళ్ళినప్పటి నుండి తెలుగు సినిమాలను తగ్గించేసింది. అక్కడే చేతినిండా సినిమాలను చేస్తూ ఫుల్ బిజీగా గడుపుతుంది. రకుల్ నటించిన రన్ వే 34, యాక్షన్ వంటి చిత్రాలు విడుదలై బాక్సాఫీస్ వద్ద పేలవ ప్రదర్శన కనబరిచాయి. దీంతో రకుల్ హిందీలో బిగ్ కమర్షియల్ హిట్ కోసం ఇంకా ఎదురుచూస్తూనే ఉంది.
రకుల్ సోషల్ మీడియాలో చాలా చురుకుగా ఉంటుంది. ఈ మధ్యనే రకుల్ సోషల్ మీడియాలో అభిమానులతో ఒక చాట్ సెషన్ ను నిర్వహించింది. అందులో తన ఫేవరెట్ మూవీ వచ్చేసి "పుష్ప" అని రకుల్ పేర్కొంది. ఇందుకు సమాధానంగా పుష్ప మ్యానరిజం ను రకుల్ చేసి చూపించింది కూడా.
అల్లుఅర్జున్ - రకుల్ ప్రీత్ కలయికలో వచ్చిన సరైనోడు సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా విషయం తెలిసిందే.
Latest News