by సూర్య | Thu, Sep 29, 2022, 04:48 PM
కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ, పి. ఎస్. మిత్రన్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా "సర్దార్". రాశి ఖన్నా, రజీషా విజయన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. బాలీవుడ్ నటుడు చుంకీ పాండే విలన్గా నటిస్తున్నారు.
లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి జి.వి ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ సినిమా నుండి మేకర్స్ బిగ్ అప్డేట్ ఇచ్చారు. ఇంకాసేపట్లోనే ఈ సినిమా నుండి టీజర్ రిలీజ్ కాబోతుందని అధికారికంగా ప్రకటించారు.
ఖైదీ తరవాత మళ్ళి అలాంటి హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు కార్తీ. ఈ సినిమాతోనైనా కార్తీ సాలిడ్ హిట్ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Latest News