by సూర్య | Fri, Sep 23, 2022, 06:11 PM
అక్టోబర్ ఐదవ తేదీన తెలుగు ప్రేక్షకులకు 'ఘోస్ట్' గా పరిచయం కాబోతున్నారు అక్కినేని నాగార్జున. విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 25వ తేదీన కర్నూల్ లో జరగబోతున్న ఘోస్ట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అక్కినేని హీరోలు నాగచైతన్య, అఖిల్ ముఖ్య అతిధులుగా హాజరు కాబోతున్నారు. ఈ విషయం ముందు నుండి ప్రచారంలో ఉన్నా, కొంచెంసేపటి క్రితమే మేకర్స్ అఫీషియల్ కన్ఫర్మేషన్ ఇచ్చారు.
ప్రవీణ్ సత్తారు డైరెక్షన్లో పర్ఫెక్ట్ మాస్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటించింది. ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి అంచనాలను నమోదు చేసింది.