by సూర్య | Wed, Aug 10, 2022, 11:04 AM
మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. నిర్మాతల సమ్మె కారణంగా ఈ మూవీ షూటింగ్ కు బ్రేక్ పడింది. ఇప్పటివరకు పలు కీలక షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం మొత్తం షూటింగ్ ను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి కానుంది. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ నెల్లోనే ఈ మూవీ నుండి రామ్ చరణ్ ఫస్ట్ లుక్ కి సంబంధించి 3 పోస్టర్లు, 1 మోషన్ పోస్టర్ విడుదల కాబోతున్నాయట. ఈ మేరకు దుబాయ్ లో ఒక మెగా ఈవెంట్ ను నిర్వహించనున్నారంట. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. ఈ న్యూస్ తో మెగా ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.