by సూర్య | Wed, Aug 10, 2022, 11:30 AM
ఎడిటర్ నుండి డైరెక్టర్ గా మారిన MS రాజశేఖర్ రెడ్డి తెరకెక్కిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". ఇందులో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్నారు. క్యాథెరిన్ ట్రెస్సా మరొక హీరోయిన్ గా నటిస్తుంది. నితిన్ తన సొంత బ్యానర్ లో నిర్మిస్తున్న ఈ చిత్రం ఆగస్టు 12వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఇప్పటివరకు వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. కానీ, ఈ సినిమాను ఇంకా జనాల్లోకి తీసుకెళ్లే విధంగా నితిన్ అండ్ టీం ప్లాన్ చెయ్యట్లేదు. గుంటూర్, హైదరాబాద్ లలో ప్రీ రిలీజ్ ఈవెంట్లు, రెండు మూడు చానెళ్లకు ఇంటర్వ్యూలు తప్పితే, పెద్దగా ప్రమోషన్స్ చేస్తున్నట్టు కనిపించట్లేదు. ఇందుకు ప్రధాన కారణం డైరెక్టర్ అనుకోవచ్చు. గతంలో రాజశేఖర్ సోషల్ మీడియాలో చేసిన కొన్ని పొలిటికల్ కామెంట్లు, ఇటీవలే ఆయన పేరుతో వచ్చిన కొన్ని ఫేక్ పొలిటికల్ సెటైర్లు... ఇలా సినిమా గురించి నెగిటివ్ పబ్లిసిటీ జరుగుతుందని ఆలోచించి నితిన్, ఒక్క ప్రెస్ మీట్ కూడా నిర్వహించలేదని తెలుస్తుంది. మరి, శుక్రవారం విడుదల కాబోయే ఈ చిత్రానికి ప్రేక్షకులు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.
Latest News